కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఐటీ దాడులు జరగలేదు : మంత్రి లోకేష్

Update: 2019-02-10 09:25 GMT

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు నాలుగున్నర ఏళ్లలో టీడీపీ అవినీతికి పాల్పడినట్లు ఒక్క రుజువైనా చూపించండి అంటూ సవాల్ విసిరిన లోకేష్. అసలు మోడీ రాష్ట్రానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ప్రత్యేక రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమలు మోడీకి గుర్తుకు రాలేదన్న ఆయన మీతో కలిసి ఉన్నన్నాళ్లూ అవినీతి గుర్తుకు రాలేదా అప్పుడు ఎందుకు ఐడీ దాడులు జరగలేదని ప్రశ్నించారు. 

Similar News