ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గంలో విరామం లేకుండా ప్రచారం నిర్వహించడంతో పాటు ఎండ అధికంగా ఉండడంతో ఆమెకు వడదెబ్బ తగిలిందని తెలిసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.