వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే తమ లక్ష్యమని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం వైసీపీలో చేరుతున్నట్లు మేడా మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. వైఎస్ ఆశయాలతో ముందుకు వెళ్తానని అన్నారు. టీడీపీలో కొందరి నేతల దుశ్చర్యలు చూడలేకపోయానని, టీడీపీలో కిందిస్థాయి నాయకులు కూడా తనపై దౌర్జన్యం చేశారని మేడా ఆరోపించారు. అన్యాయంగా తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. వైసీపీ నుంచి రాజంపేట అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మరని మల్లికార్జునరెడ్డి అన్నారు.