విశాఖపట్నం ఎయిర్పోర్టులో మరోసారి కత్తి కలకలం రేగింది. నేడు (శుక్రవారం) ఓ వ్యక్తి కత్తిని చేతిలో పట్టుకొని విశాఖ ఎయిర్పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎయిర్పోర్టులోని పార్కింగ్ నుంచి ఇన్గేట్ వరకు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తిని విచారణ చేయగా ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించారు. ఆ వ్యక్తి పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. అయితే ఎన్నికల ఫలితాల వెలువడిన మరుసటి రోజు ఎయిర్పోర్ట్కు వీఐపీల తాకిడి ఎక్కువ కావడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.