ఏపీలో టీడీపీ గెలుపుపై పందెం..చివరకు

Update: 2019-06-08 09:17 GMT

ఎన్నికలంటేనే పందేం రాయుళ్లకు ఎక్కడి లేని సంతోషం. కూర్చున్న దగ్గరి నుండే లక్షల్లో డబ్బు సంపాదించుకోవచ్చు కదా! అయితే సంపాదించుకోవడం ఏమో కానీ ఇప్పుడు అదే బెట్టింగ్ కాసీ చివరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే ఇటివల ముగిసిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుందంటూ లక్షల్లో పందెం కట్టాడు. తీరా ఆ పార్టీ ఓడిపోఅయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం నేపథ్యంలో అతడు పందెం ఓడిపోయాడు.

దీంతో ఎదుటి పార్టీ ఒత్తిడిని తట్టుకోలేని అతడు బలవన్మరణానికి యత్నించడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన తణుకులో చోటుచేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా  తణుకులో జరిగింది. సందీప్(30) అనే యువకుడు టీడీపీ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాశాడు. తీరా టీడీపీ ఓడిపోవడంతో రూ.20 లక్షలు చెల్లించాడు. కానీ వాళ్లు మొత్తం డబ్బులు చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక నిన్న రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో హుటాహుటిన సందీప్ ను ఆసుపత్రికి తరలించారు. పస్తుతం సందీప్ పరిస్థితి విషమంగానే ఉంది, దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News