మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కనకారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శాసనసభ సభ్యుడిగా ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. కనకారెడ్డి 2014-18 మధ్య మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు.