యాదాద్రిభువనగిరి జిల్లాలో లారీ దగ్ధం

Update: 2019-05-29 03:46 GMT

యాదాద్రి భూవనగిరి జిల్లాలో లారీ బోల్తా పడి దగ్ధం అయ్యింది. కర్నాటక నుంచి వస్తున్న లారీ చౌటుప్పల్ శివారులో విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారి పక్కన కల్వర్ట్ ఢీకొట్టింది. లారీ టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 

Similar News