ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. కోర్టులోనే లాయర్ ఆత్మహత్యాయత్నం

Update: 2019-02-08 08:48 GMT

ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ రగిలింది. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో లాయర్ అనిల్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానికి లేఖ రాశాడు. అలాగే నుదుటిపై ప్రత్యేక హోదా ఇవ్వాలని రాసుకుని కోర్టు హాల్ లోకి వచ్చి అందరు చూస్తుండగానే ఘటనకు పాల్పడ్డాడు. అనిల్ కుమార్ ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Full View 

Similar News