కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్ 16 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీ మెడలు వంచి నిధులు తీసుకువస్తారని అన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రైతు బంధును కాపీ కొట్టి కిసాన్ సమ్మన్ పథకం తెచ్చారని అన్నారు. ఏప్రిల్ నుంచి ఆసరా పెన్షన్లు రూ.2016 ఇస్తామన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.