సీఎల్పీ నేత ఎంపికపై రాహుల్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. పదవి కావాలని ఆశపడడంలో తప్పు లేదన్న ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమేనని చెప్పారు. భట్టి విక్రమార్కకు డిప్యూటీ స్పీకర్గా పని చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓటమికి ఒక్కరినీ బాధ్యులను చేయటం సరికాదని కోమటిరెడ్డి తెలిపారు. సీట్ల కేటాయింపులోనూ కొన్ని తప్పిదాలు జరిగాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై రాహుల్దే తుది నిర్ణయమని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడరని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.