ఎన్నికల ముగిసినా ఏపీలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా ఇనిమెట్ల గ్రామంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కోడెలపై దాడి ఘటనలో సీసీ ఫుటేజ్లను పరిశీలించి 8 మందిని అదుపులోకి తీసుకోగా మొత్తం 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు వందమంది పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి డిఎస్పీ పరిశీలించారు.