విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ కమిటీ ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు శ్రద్ధ ఆస్పత్రిలో జరిగిన అన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సల తీరుతెన్నులను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు నేత్వతృంలో ఏర్పాటైన ఈ కమిటీలో డీసీహెచ్ఎస్ నాయక్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున సభ్యులుగా ఉంటారు. ఐదు రోజుల్లో విచారణ జరిపి తనకు నివేదిక అందించాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు.