ఖమ్మం కాంగ్రెస్‌లో వలసల కలకలం... మరో ఇద్దరు ఎమ్మెల్యేలు...

Update: 2019-03-15 05:34 GMT

పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్‌ పార్టీ కకావికలం అవుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే పినపాక, ఇల్లందు, పాలేరు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇక వీరి బాటలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా ఇవాళో రేపో కారెక్కుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వైఫల్యం చెందారంటూ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నారు. 

Similar News