తీర్థయాత్రలో కేసీఆర్

Update: 2019-05-10 11:03 GMT

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణా సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం రామేశ్వరంలో పర్యటిస్తున్నారు. రామేశ్వరంలో ప్రసిద్ధి గాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కేసీఆర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ దంపతులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ధనుష్కోటి, రామసేతు, పంచముఖి హనుమాన‌ ఆలయాలను కేసీఆర్ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు. 

Similar News