తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, నిజామాబాద్ ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి హైదరాబాద్లోని రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న మధ్యాహ్నం కేసీఆర్ స్వయంగా హాస్పటల్కి వెళ్లి మనవడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.