టీడీపీ సీనియర్ నేత ఇంటికి సీఎం కేసీఆర్... టీఆర్ఎస్‌లోకి....

Update: 2019-04-05 09:46 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావుతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని మండవ నివాసానికి కేసీఆర్ స్వయంగా వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై మండవతో చర్చించిన కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఉదయమే టీఆర్ఎస్ సీనియర్ నేతలు మండవతో చర్చించారు. కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్ లో చేరేందుకు మండవ కూడా ముందుకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి మండవ వెంకటేశ్వరరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.  

Similar News