సీఎం జగన్‌కి 7 లేఖలు రాసిన కన్నా

Update: 2019-06-05 07:56 GMT

ఏపీ సీఎం జగన్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 7 లేఖలు రాశారు. రాజధాని భూముల అక్రమాలతో పాటు రైతులకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాక గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయడంతో పాటు ఇసుక మాఫియాకు అడ్డుకట్టవేసి కొత్త పాలసిని తీసుకురావాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో నిర్వాసితులు, గిరిజనులకు న్యాయం చేయడంతో పాటు అదే విధంగా విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. అదేవిదంగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు అగ్రిగోల్డ్‌ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉ‍న్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ మోహన్ రెడ్డికి 7లే‌ఖలు రాశారు. 

Tags:    

Similar News