నరేంద్ర మోడీ ఈనెల 30వ తేదీన రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ వేడుకకు హాజరుకావాలంటూ తమిళనాడుకు చెందిన మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్కు ఆహ్వానం అందింది. 30వ తేదీన రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిభవన్లో మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మోడీతో ప్రమాణం చేయిస్తారు. నాథూరామ్ గాడ్సే మొట్టమొదటి హిందూ ఉగ్రవాది అని ఎన్నికల వేళ కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది.