జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు సంబంధించిన మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో విశాఖ ఎంపీ అభ్యర్థిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి ఇటీవలే జనసేన తీర్థంపుచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్టు జనసేన ప్రకటించింది.
శాసనసభ అభ్యర్థులు - విశాఖ పట్నం నార్త్: పసుపులేటి ఉషా కిరణ్,విశాఖ సౌత్: గంపల గిరిధర్,విశాఖ ఈస్ట్: కోన తాతా రావు,భీమిలి: పంచకర్ల సందీప్, అమలాపురం: శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం: తుమ్మల రామ స్వామి, పోలవరం: చిర్రి బాల రాజు,అనంతపురం: టి.సి. వరుణ్