చిగురుపాటి జయరాం హత్య కేసులో మరోకోణం వెలుగుచూసింది. నిందితుడు రాకేష్ రెడ్డి రోజుకో కొత్త విషయం బయటపెడుతున్నాడు. రాకేష్రెడ్డికి తను చేసే ప్రతి పనిని ఫోన్లో వీడియో తీసుకునే అలవాటుంది. జయరాంను హత్య చేస్తున్నప్పుడు కూడా సెల్ఫోన్లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. జయరాం బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్నప్పుడు కూడా వీడియో తీశాడు రాకేష్. పోలీసులు ఈ వీడియోలన్నింటిని పరిశీలిస్తున్నారు. మరోసారి నందిగామలో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. నిందితుడు రాకేష్ రెడ్డితో టచ్లో ఉన్న ఇబ్రహీంపట్నం ఏసీపీ, నల్లకుంట సీఐలకు నోటీసులు జారీ చేశారు. వారిని బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి పిలిచి విచారించనున్నారు.