మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనవిజయంతో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సాధించిన సీట్ల కంటే కొద్దిగా తక్కువగానే సీట్లు జనసేనకు వస్తాయి'' అని లగడపాటి అభిప్రాయపడ్డారు. రేపు కచ్చితమైన సంఖ్యలతో తిరుపతిలో సర్వే ఫలితాలు వెల్లడిస్తానని ఆయన మీడియాకు తెలిపారు.