జార్ఖండ్లోని జంషెడ్పూర్లో నడిరోడ్డుపై పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిని మహిళ చితకబాదింది. అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని 50వేలు డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది. డబ్బులు ఇస్తానంటూ ఫోన్ చేసి మరీ పిలిచి ఏసీబీ అధికారిగా చెప్పుకునే వ్యక్తిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని మ్యాంగో పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ కుటుంబ సమస్యలతో బాధపడుతోంది. అయితే సదరు మహిళకు ఓ వ్యక్తి పరిచమయ్యాడు. యాంటి కరప్షన్ బ్యూరో నుంచి వచ్చానంటూ ఊదరగొట్టాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తానంటూ భరోసా ఇచ్చాడు. 50వేల రూపాయలిస్తే సమస్యలన్ని సాల్వ్ చేస్తానన్నాడు. ఇయ్యకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో కోపం వచ్చిన ఆ ఇల్లాలు ఫేక్ ఆఫీసర్ ను పిచ్చ కొట్టుడు కొట్టింది. నడిరోడ్డు మీద చెప్పుతో గుణపాఠం చెప్పింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జార్ఖండ్ జంషెడ్ పూర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH Jamshedpur: A woman thrashed a man, in Mango area, who posed as an Anti-Corruption Bureau Officer and demanded Rs 50,000 from her. The woman called him on the pretext of giving the money to get him arrested. Police is interrogating the man. #Jharkhand pic.twitter.com/98z9YDHOGd
— ANI (@ANI) May 8, 2019