జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Update: 2019-06-07 03:27 GMT

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా నగర సమీపంలోని లస్సీపొరా వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. సంఘటన స్థలంలో ఓ 3ఏకే రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీజవాన్ల గాలింపు కొనసాగుతోంది.

Tags:    

Similar News