జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామా నగర సమీపంలోని లస్సీపొరా వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. సంఘటన స్థలంలో ఓ 3ఏకే రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీజవాన్ల గాలింపు కొనసాగుతోంది.