జమ్ముకశ్మీర్లో సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. ఎల్ఓసీ వెంట ఆరుచోట్ల కాల్పులకు తెగబడ్డారు. భారత సైనిక శిబిరాలే టార్గెట్గా త్రాల్లో మందుపాతర పేల్చారు. ఆర్మీ కాన్వాయ్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పలువురుకి గాయాలయ్యాయి. పాక్ వరుస దాడులతో సరిహద్దు ప్రాంతం ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పాక్ సైన్యం దాడులను భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి.