12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అమరణ దీక్ష చేపట్టారు. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయాలను చూస్తుంటే ఏకంగా రాజకీయాల నుండి విరమణ తిసుకోవలనిపిస్తుందని అన్నారు .. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అయితే దానికి నాయకత్వ వైఫల్యం ఎలా అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత అవసరాల కోసం పార్టీ మారితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎవరు ఎలా వ్యవహరించినా తాను మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు...