మేనిఫెస్టో అమలు కమిటీ ఏర్పాటు చేసే దిశగా జగన్ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు మేనిఫెస్టో అమలు కమిటీలో చోటు కల్పించాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో పాటు కేబినెట్లో అవకాశం దక్కని వారికి కమిటీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికల హామీలు అమలు పర్చే బాధ్యతను మేనిఫెస్టో కమిటీకీ అప్పగించనున్నారు. మేనిఫెస్టో అమలుతో పాటు పథకాల అమలు తీరును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.