స్వరూపానంద స్వామిని కలవనున్న జగన్.. కేబినెట్‌కి ముహుర్తం పెడుతున్నారా?

Update: 2019-06-03 06:57 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రేపు ఉదయం స్వామి స్వరూపానంద ఆశీస్సులు జగన్ పొందనున్నారు. కాగా సీఎం హోదాలో ఫస్ట్ టైమ్ వైఎస్ జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. మంత్రి వర్గ ఏర్పాటు ముహూర్తం కోసం జగన్ స్వామిజీ సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. సీఎం వెంట పలువురు పార్టీకి చెందిన నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత స్వరూపానందను జగన్ దర్శించుకోలేదు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. విశాఖ శారదాపీఠం స్వరూపానంద స్వామిజీ వైఎస్ జగన్‌కు సన్నిహితుడు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌ స్వరూపానంద స్వామిని కలిసి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Similar News