ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించడంపై జగన్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. భేటీలో రాష్ట్ర సమస్యలను జగన్ ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై ప్రధానికి నివేదిక సమర్పించారు. జగన్ వెంట సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైసీపీ ఎంపీలు ఉన్నారు.