ఎల్లుండి కేసీఆర్, జగన్ భేటీ ...

Update: 2019-06-26 06:38 GMT

ఫ్రెండ్లీ పంపకాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫోకస్ పెట్టారు. ఎల్లుండి ప్రతి భవన్‌లో కేసీఆర్, జగన్ భేటీ కానున్నారు. నీటి వాటాలు, విభజన సమస్యలపై ప్రధాన చర్చ జరుగనుంది. గోదావరి నీటిని తరలించే ప్రతిపాదన, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పంపకం వంటి విషయాలపై చర్చిస్తారు. తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 3న ఇరు రాష్ట్రాల సీఎస్‌లు గవర్నర్‌తో భేటీ కానున్నారు. సీఎంల భేటీ నిర్ణయాలపై సీఎస్‌లో గవర్నర్‌కు నివేదిక సమర్పిస్తారు. వీటి ఆమోదం కోసం గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపుతారు.  

Tags:    

Similar News