ఇంటర్ బోర్డ్‌లో మరో గందరగోళం

Update: 2019-05-15 09:56 GMT

ఇంటర్‌ సప్లిమెంటరి పరీక్షలపై మరోసారి సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి ఈ నెల 25 న సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్టు ఏర్పాట్లు చేసింది. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ నెల 27 న రీ వెరిఫికేషన్‌, రీ వాల్యుయేషన్‌ పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని బోర్డు నిర్ణయించింది. దీంతో సప్లిమెంటరీ పరీక్షలపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు తేదీలు ప్రకటించి పరీక్షలు వాయిదా వేశారు. తాజా పరిస్థితిలో మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Full View 

Similar News