మహాత్మా గాంధీ పై ఐఏఎస్ అధికారి వివాదాస్పద వాఖ్యలు ..

Update: 2019-06-05 01:22 GMT

మహాత్మా గాంధీ గురించి వివాదాస్పద ట్వీట్ చేసిన ముంబయికి చెందిన ఐఎఎస్ అధికారి నిధి చౌదరి పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . దీనితో ఆమెను బదిలీ చేసారు అధికారులు . ప్రస్తుతం ఆమెను బ్రహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) నుండి నీరు, పారిశుధ్య శాఖకు బదిలీ చేశారు. ఇక మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె చేసిన ట్వీట్ మీద వివరణ ఇవ్వాలని కోరింది. ట్వీట్ కోసం నిధి చౌదరికి షోకోజ్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిని ప్రస్తుతం ట్విట్టర్ నుండి తొలిగించారు నిధి చౌదరి... ఆమె పూర్వం గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ జాయింట్ మునిసిపల్ కమీషనర్ పనిచేసిన నిధి చౌదరి ఇప్పుడు డిప్యూటీ సెక్రటరీ, నీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగంగా పోస్ట్ కి బదిలీ చేయబడింది.



Tags:    

Similar News