నిన్నటి వైమానికి దాడులతో తీవ్ర అసహనంతో ఉన్న పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. 3 పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన గగన తలంలోకి ప్రవేశించాయి. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాలు నియంత్రణరేఖ దాటి నౌషెరా, రాజౌరీ సెక్టార్లోకి చొరబడ్డాయి. పాక్ గగనతల ఉల్లంఘనను పసిగట్టిన భారత వైమానిక దళం పాక్ జెట్ ఫైటర్స్పై కాల్పులు జరిపింది. భారత వైమానిక దళం కాల్పుల్లో పాక్ యుద్ధ విమానం నేలకూలింది. భారత యుద్ధ విమానాలు జరిపిన కాల్పుల్లో ఓ పాక్ జైట్ ఫైటర్ లామ్ వ్యాలీలో కుప్పకూలింది. పీఓకేకి 3 కి.మీ దూరంలో పాక్ యుద్ధ విమానం కూలిపోయింది. మన గగనతలంలోకి ప్రవేశించిన మిగతా 2 పాకిస్తాన్ యుద్ధవిమానాలు తోకముడిచి స్వదేశానికి జారుకున్నాయి. విమానం కూలిపోవడానికి ముందే పారాచ్యుట్ సాయంతో పాక్ పైలట్ కిందికి దూకిన దృశ్యాలు కనిపించాయి. దూకిన పాక్ పైలట్ ఏమయ్యాడన్నదికి ఇంకా తెలియరాలేదు.