కశ్మీర్‌లో కూలిన భారత యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు దుర్మరణం

Update: 2019-02-27 06:17 GMT

జమ్ముకశ్మీర్‌లో ప్రమాదవశాత్తూ భారత యుద్ధ విమానం కూలింది. భారత వాయుసేనకు చెందిన జెట్ ఫైటర్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు. బుద్గాం జిల్లాలో గరెండ్‌ కలాన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాలతోనే విమానం కూలినట్లు భావిస్తున్నారు. మిగ్‌ యుద్ధ విమానం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Full View

Similar News