తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానన్నారు మాజీ ఎంపీ కవిత. ప్రజా స్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని బంగారు తెలంగాణే లక్ష్యంగా కలిసి పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. అని ఆమె తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడంతో తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈనెల 24న పార్టీ కార్యకర్త కిషోర్ గుండెపోటుతో మరణించాడు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. పదవుల కోసం టీఆర్ఎస్ ఎన్నడూ పని చేయలేదన్న విషయాన్ని అందరు గుర్తించాలన్నారు. దేశంలో బీజేపీ వస్తుందనే విశ్వాసంతోనే నిజామాబాద్లో ఆ పార్టీని గెలిపించారని తెలిపారు.
Visited home of our party Karyakarta Late Shri Kishore who collapsed with heart stroke unable to come to terms with result of Nizamabad Parliament Constituency and consoled his family members. May God give strength to them to overcome this loss. We will stand by the family. pic.twitter.com/JvcCvnSfij
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 27, 2019