ఏపీలో భారీగా నగదు పట్టివేత

Update: 2019-04-05 07:50 GMT

ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇవాళ ఒక్కరోజే దాదాపు 8 కోట్లకుపైగా నగదు దొరికింది. పోలీసుల తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలిలో 7 కోట్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డబ్బులు టీడీపీకి చెందినవిగా అనుమానిస్తున్నారు. అయితే, గుట్టుచప్పుడుకాకుండా పోలీసులతో సెటిల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయలకుపైగా నగదు పట్టుబడింది. విశాఖ నుంచి రాజాంకు ఆర్టీసీ బస్సులో నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు వైసీపీ నేతకు చెందిందిగా పోలీసులు భావిస్తున్నారు. 

Similar News