జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలు అయింది .. అయితే దీనికి గల కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేని సినీ నటుడు సుమన్ అన్నారు .ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావడాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడి జగన్ విజయాన్ని కైవసం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం ద్వారా సమన్యాయాన్ని జగన్ చేశారని అభినందించారు . సినీ పరిశ్రమను కూడా ఏపీకి తీసుకొచ్చి, ఇండస్ట్రీని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. మరి సుమన్ వాఖ్యాలపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి ..