ముంచిన వడగండ్ల వాన

Update: 2019-02-16 07:27 GMT

జగిత్యాల జిల్లాలో కురిసిన అకాలవర్షం రైతులకు నష్టం మిగిల్చింది. కోరుట్ల, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లపూర్ మండలాల్లో వర్షం ప్రభావం చూపింది. ఈదురు గాలులు వడగండ్లవాన కురవడంతో పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయి పడ్డాయి. చెట్ల కింద నిలిపి ఉంచిన వాహనాలు ధ్వంసమయ్యాయి. రేకుల షెడ్లు కూలిపోయాయి. మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కు అమ్మకానికి తీసుకువచ్చిన పసుపు, కందులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. పంట చేలల్లో ఉన్న మొక్కజొన్న, అవ పంట నేలకొరిగాయి. మామిడి పూత రాలిపోయింది. పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.




 





 



 


Similar News