ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్న ఆదిశేషగిరిరావు ఏపీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు కలిసి టీడీపీని గెలిపించాలని కోరారు. ఆదిశేషగిరిరావు పార్టీలోకి రావడం సంతోషకరమన్న చంద్రబాబు ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై నిప్పులు చెరిగారు.