నిన్న, మొన్నటి వరకు రాజంపేట పంచాయితీతో వార్తల్లో నిలిచిన కడప జిల్లాలో మరో వివాదం మొదలైంది. మంత్రి ఆది నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్ములమడుగు నియోజకవర్గం టికెట్ తమకే కావాలంటూ రామసుబ్బారెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో మంత్రి ఆది కూడా పట్టు వీడకపోవడంతో గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి దగ్గర పంచాయితి నడుస్తుంది. మధ్యస్తంగా ఒకరు ఎమ్మెల్యేగా మరోకరు ఎంపీగా పోటీ చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించినా ఎవరు ఎంపీగా పోటీ చేయాలనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. దీంతో సీఎం చంద్రబాబుతో రెండు వర్గాలకు చెందిన నేతలు భేటి అయ్యారు.