గద్వాల్ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు.మృతిపట్ట గద్వాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్టమోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. భీముడు మృతి నేపథ్యంలో పరిషత్ ఎన్నికల సంబురాలకు దూరంగా ఉండాలని కార్యకర్తలకు కృష్ణమోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయన మృతి పట్ల బీజేపి నాయకురాలు డీకే అరుణ సంతాపం తెలిపారు ..