టీడీపీ ఎమ్మెల్సీగా అశోక్బాబు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ అశోక్బాబుతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంపీ కనకమేడల, మండలి బుద్ధప్రసాద్లు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని స్పష్టంచేశారు. చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని అశోక్బాబు ధీమా వ్యక్తంచేశారు. ఈవీఎంలపై టీడీపీ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఎమ్యెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్ల తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి ఎమ్యెల్సీగా అవకాశం వచ్చిందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తానన్నారు.