కర్నూలు జిల్లా శ్రీశైలం టీడీపీలో అయోమయం నెలకొంది. పోటీ నుంచి బుడ్డా రాజశేఖరరెడ్డి తప్పుకోవడంతో శ్రీశైలం సీటు పెండింగ్లో ఉంది. ఈ సీటు కోసం నలుగురు ఆశావహులు తెరమీదకొచ్చారు. ఇవాళ కర్నూలులో బహిరంగ సభకు హాజరవుతున్న సీఎం చంద్రబాబు శ్రీశైలం టిక్కెట్టు వ్యవహారాన్ని తేల్చనున్నారు. చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి టీడీపీలో చేరనున్నారు. అయితే, టిక్కెట్టు దక్కకపోవడంతో ఎస్వీ మోహన్రెడ్డి వర్గం అసంతృప్తిలో ఉండగా టీజీ భరత్ వర్గం సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీకి గుడ్బై చెప్పి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.