ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో అగ్నిప్రమాదం

Update: 2019-01-14 09:28 GMT
Prayagraj

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దిగంబర్‌ అకాడ శిబిరంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో తాత్కాలిక నిర్మాణాలు కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రేపటి నుంచి ప్రయాగ్‌రాజ్‌లో అర్ధకుంభమేళా ప్రారంభంకానుంది. ఈ కుంభమేళాకు నాగ సాధవులు భారీగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగడంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.  

Similar News