సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామికవాడలోని స్పార్ ల్యాబ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో పోగలు భారీగా వ్యాపించాయి. ఆందోళనతో పరుగులు తీసిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది, మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.