ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.45గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. సాగునీరు, వ్యవసాయం, మహిళలు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. 2014- 15లో రాష్ట్ర బడ్జెట్ 1.11లక్షల కోట్లు ఉంటే 2019-20లో అది రెట్టింపై 2.2లక్షల కోట్లకు చేరింది. దీంతో ప్రాధాన్యత రంగాలకు భారీగా కేటాయింపులు పెరగనున్నాయి. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మంత్రి యనమల ఇప్పటికే అసెంబ్లీకి బయల్దేరారు.