ఫ్యాన్ హవా..

Update: 2019-05-23 03:56 GMT

ఇప్పటి వరకూ 45.9 వోట్ శాతం వైసీపీ సంపాదించింది. ఇక టీడీపీ 39.9 వోట్ శాతం సాధించింది. దీంతో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోన్న పరిస్థితి. దాదాపుగా ఆరు శాతం ఓట్ల తేడా కచ్చితంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరంగా ఉండిపోయిన వైసీపీ ఈసారి స్పష్టంగా 6 శాతం అధిక ఓట్లను ఇప్పటి వరకూ సాధించడం ఆ పార్టీకి ప్రజల మద్దతును తెలుపుతోంది. ఇంకా చాలా రౌండ్ ల లెక్కింపు ఉన్నప్పటికీ ఆరు శాతం తేడాను కవర్ చేసుకోవడం టీడీపీకి కష్టమైనా పనిగానే కనిపిస్తోంది.  ఇక జనసేన తెలుగుదేశం ఓట్లను కొల్లగొట్టినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీఏకి దాదాపు 9  శాతం ఓట్లు ఇప్పటి వరకూ వచ్చాయని చెబుతున్నారు. వైసీపీ ఇప్పటి వరకూ 72 స్థానాల్లోనూ.. టీడీపీ 18 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉండగా జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. 

Similar News