మరో సారి ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతున్న బీజేపీ...రేపు మంత్రివర్గ...

Update: 2019-05-20 09:51 GMT

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఊపుతో మరో సారి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రేపు సాయంత్రం NDA భాగస్వామ్య పక్షాలకు విందు ఇవ్వనున్నారు. ఇదే సమయంలో రేపు మధ్యాహ్నం కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఐదేళ్లుగా తనకు సహకరించిన మంత్రులకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. విందు సందర్భంగా ఎగ్జిట్ పోల్స్‌, కొత్త ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఈ విందులో ప్రధాని మోడీతో పాటు జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనున్నారు. 

Similar News