విజయవాడ దుర్గగుడి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించడం కలకలం రేపుతోంది. దుర్గగుడిలో సింహాచలం అనే ఉద్యోగి గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. అతని భార్య దుర్గ కూడా గుడిలోనే కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. హుండీ లెక్కింపులో గోల్డ్ చైన్ చోరీకి యత్నించారు సింహాచలం. హుండీ లెక్కిస్తుండగా బంగారు గొలుసును తప్పించిన స్వీపర్ సింహాచలం ఆ చైన్ను భార్య చేతికిచ్చి మాయం చేసే ప్రయత్నం చేశాడు. అయితే చోరీ యత్నాన్ని గుర్తించిన సెక్యూరిటీ స్వీపర్ సింహాచలంతో పాటు అతని భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.