పవన్ పై వర్మ కామెంట్స్ ..

Update: 2019-06-09 05:56 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి రెచ్చిపోయారు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. పార్టీ ఓటమిపై సమీక్షలు నిర్వహించిన పవన్ నిన్న గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు . అందులో భాగంగా తనను ఓడించడానికి ప్రత్యర్థులు భీమవరంలో రూ. 150 కోట్లను ఖర్చు చేశారని పవన్ కల్యాణ్ అన్నారు . అయితే దీనిపైన రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో స్పందించారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనన్న వర్మ, పవన్ ను నిజంగా గెలిపించాలని ఓటర్లు అనుకుంటే, ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా, అతనికే ఓటేసేవారని వ్యాఖ్యానించారు. తాను సేవ చేయాలని అనుకున్న ప్రజలు అవినీతిపరులన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక్క ఓటమితో జనసేన ఆగిపోదని జనసేన కార్యకర్తలు కూడా కుంగిపోవద్దని, తాను 25 సంవత్సరాలు రాజకీయాలు చేసేందుకే వచ్చానని కూడా ఆయన అన్నారు. 



Tags:    

Similar News