సహజంగా మనం ఏదైనా హోటల్ కి వెళ్తే తిన్నాక కచ్చితంగా బిల్లు కట్టాల్సిందే .. కానీ ఇక్కడ అ పని లేదు .. ఎంతైనా తినొచ్చు .. ఎన్ని సార్లు అయిన టీ - కాఫీలు తాగొచ్చు .. ఇది ఎక్కడంటే పచ్చిమ బెంగాల్ లోని అలిపుర్దువార్ జిల్లాలో ఉంది. శంభూ బోస్ అనే వ్యక్తికి ధోని అంటే వీరాభిమాని .. అందుకే ధోని పేరుతో ఓ హోటల్ పెట్టాడు .. ఇక్కడికి ధోని అభిమానులు ఎవరైనా వచ్చి భోజనం చేసినా వారి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు .. అసలు ధోని పైన అభిమానం ఎలా పెంచుకున్నావ్ అని బోస్ అని అడిగితే ఇలా చెబుతున్నాడు ..
చిన్నప్పటి నుండి ధోని అంటే అభిమానం ఎక్కువని , అతని ఆటతీరు అన్నా అతని వ్యక్తిత్వం అన్నా ఎంతో ఇష్టమని ముఖ్యంగా వరల్డ్ కప్ లో భాగంగా ధోని చివరిలో సిక్స్ కొట్టడం చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయని చెప్పుకొచ్చాడు .. ధోనిని ఎప్పటికైనా కలవాలి అన్నదే తన కోరిక అని చెప్తున్నాడు .. ఒకవేళ నేను ధోనీని కలిస్తే, 'నా హోటల్కు రావాల్సిందిగా ధోనీని ఆహ్వానిస్తాను'. మహీకి అన్నం, చేపల కూర అంటే తెగ ఇష్టమని నాకు తెలుసు' అని చెబుతాడు బోస్. ధోని పైన ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాడు బోస్